తమిళం నేర్చుకుంటానన్న రోశయ్య : గవర్నర్గా ప్రమాణం

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రోశయ్య మాట్లాడారు. తాను త్వరలో తమిళం నేర్చుకుంటానని చెప్పారు. తమిళ ప్రజలతో తమిళంలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టబద్దంగా నడుచుకుంటానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్కు, తమిళనాడుకు ఎనలేని బంధం ఉందన్నారు. తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికు కృషి చేస్తానని చెప్పారు. కాగా రోశయ్య తమిళనాడుకు 22వ గవర్నర్. మరో విషయమేమంటే తమిళనాడుకు ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు వారు గవర్నర్లుగా పని చేశారు. ముగ్గురూ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.












Click it and Unblock the Notifications