కేశవ్ నాకు తెలియదు: సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ

Laxmi Narayana
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎవరో తనకు తెలియదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ శుక్రవారం ఓ చానల్ కార్యక్రమంలో చెప్పారు. పయ్యావుల కేశవ్ తన బంధువంటూ వివేకానంద ఆరోపణలు ఎందుకు చేశారో తనకు తెలియదన్నారు. రాష్ట్ర రాజకీయ నేతల్లో తనకు బంధువులు ఎవరూ లేరన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న వారే బంధుత్వాన్ని నిరూపించారన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకే జగన్, ఎమ్మార్ పైన తాము కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నానన్నారు. కాగా జెడి లక్ష్మీ నారాయణ నాలుగేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నట్టుగా సమాచారం. ఆయనపై ఇప్పటి వరకు చేయని ఆరోపణలు కొత్తగా చేయడం వెనుక రాజకీయ కోణాలు ఉండి ఉండవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం జగన్ బాబాయి వివేకానంద రెడ్డి మాట్లాడాతూ జెడి లక్ష్మీ నారాయణకు టిడిపి నేత పయ్యావుల కేశవ్ బంధువు అని ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+