చిరు నమ్ముకున్నారు జగన్ అమ్ముకున్నారు!: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు గుప్పించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ విలీన సభలో లగడపాటి మాట్లాడారు. జగన్‌ను పరోక్షంగా ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు దర్జాగా సంపాదించుకున్న వారు ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు కాంగ్రెసును అమ్ముకొని వెళితే చిరంజీవి కాంగ్రెసును నమ్ముకొని వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికలకు ముందు దొంగ ప్రమాణాలు చేసిందన్నారు. అయినా ప్రజలు నమ్మలేదన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం జగన్‌పై బౌన్సర్లు వేశారు. వ్యోక్స్ వ్యాగన్ విషయంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు బయట తిరగడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తిరగడానికి సిగ్గుపడ్డానన్నారు. అదే జగన్ మాత్రం దర్జాగా తలెత్తుకు తిరుగుతున్నాడన్నారు. అలా ఎలా తిరగగలుగుతున్నాడో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తామే నిజమైన వారసులం అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసుకు ఖచ్చితమైన, స్పష్టమైన కార్యాచరణ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిజాలు ఎప్పుడూ చెప్పరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+