వైయస్ జగన్ పక్షులు కాంగ్రెసులోకి: శంకర రావు

అవినీతికి రాజముద్రలు వేసిన వారు సిబిఐని ప్రశ్నించే అర్హత లేదన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయన్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీ నారాయణ నిజాయితీపరుడన్నారు. జగన్ ఆస్తులపై కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. వైయస్సార్ వర్దంతి రోజున పేపర్ ప్రకటన ఇవ్వక పోవడం బాధ కలిగించిందన్నారు. అయినా ఇదంతా పవర్ గేమ్ అన్నారు. జగన్ వర్గం రాజీనామాలు ఆమోదించిన పక్షంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల ప్రచారానికి కడప వెళతానని చెప్పారు.












Click it and Unblock the Notifications