వైయస్ జగన్ నుండి ఎమ్మెల్యేలకు పిలుపు

అయితే ఈ సమావేశం ప్రధానంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెసు వైపు వెళ్లరని చెప్పడానికే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర్ రావు తదితర కాంగ్రెసు నేతలు జగన్ వర్గంలోని పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వస్తారనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెసు వైపు వెళ్లేందుకు సిద్ధంగా లేరని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రాజీనామాలు చేయని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తద్వారా తన బలం పెరుగుతుందే కానీ తరగడం లేదని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నట్టుగా సమాచారం. కాగా సోమవారం జగన్ న్యూఢిల్లీ వెళుతున్న విషయం తెలిసిందే. తనపై రాజకీయ కక్షతోనే సిబిఐ విచారణ జరుగుతోందని జాతీయస్థాయి ప్రతిపక్ష పార్టీలకు జగన్ వారికి చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications