గాలి అరెస్టుతో జగన్కు లంకె పెడుతున్న నేతలు

గాలి జనార్దనరెడ్డి అరెస్టుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు హర్షం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆయన ఆక్రమ ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన సోమవారం కర్నూలు జిల్లా పత్తికొండలో మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. పార్టీ నూతన కార్యాలయం 'ఈశ్వరరెడ్డి భవన్'ను ఆయన ప్రారంభించారు. అవినీతి నిర్మూలనకు ప్రజలంతా సహకరిస్తే ఆ భూతాన్ని తరిమికొట్టటం సాధ్యమని అన్నారు.
గాలి జనార్దన్రెడ్డి అరెస్టుతో ఓబుళాపురం గనుల అక్రమాలపై తన వాదన నిజమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ విషయంలో జగన్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని ఆయన సోమవారం ఢిల్లీలో అన్నారు. గనుల తవ్వకాల ద్వారా వేల కోట్లు ఆర్జించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి జనార్దన్రెడ్డి ఎదిగారని, సీబీఐ సరైన సమయంలో సమర్థంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో అక్రమ గనుల తవ్వకాలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. బయ్యారం అక్రమ తవ్వకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని వీహెచ్ అన్నారు. లేకపోతే ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందన్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు మంచి పరిణామమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇలాంటి వారి ఆస్తులను జప్తు చేయాలని పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గనుల మాఫియాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో తీగ లాగితే, ఆంధ్ర ప్రదేశ్లో డొంక కదులుతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications