ములాయంతో జగన్ భేటీ, కాంగ్రెసుపై ఒత్తిడికేనా?

కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తేవడానికా, కాంగ్రెసుతో రాజీ పడడానికా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు కావడం జగన్కు పెద్ద షాక్ వంటిదే. తనను కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు అవసరమైన మార్గాలను జగన్ అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, జగన్ సోమవారం ఉదయం హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు. పార్లమెంటు సభ్యులు దీపీందర్ సింగ్, అఖిలేష్ సింగ్లతో కూడా ఆయన సమావేశమయ్యారు.
ములాయం సింగ్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీలు కాంగ్రెసు పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెసుతో రాయబారాలు చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మీడియా ప్రతినిధుల వద్ద జగన్ కాంగ్రెసుపై అంత ఘాటుగా విమర్శలు చేయలేదు. తాను బిజెపి నేత సుష్మా స్వరాజ్నే కాదు, ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. జగన్ తన భేటీల ద్వారా ఏ విధమైన ఫలితాన్ని ఆశిస్తున్నారనేది అర్థం కావడం లేదు. సిబిఐ దర్యాప్తును ఆపించడం ఈ దశలో సాధ్యమవుతుందా అనేది సందేహమే. అయితే, అది అరెస్టు దాకా వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications