అవినీతిలో గాలికి జగన్ తమ్ముడు కాదు: డిఎల్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్ను గెలిపించారన్నారు. సిబిఐ విచారణ స్వాగతిస్తున్నామంటూనే దర్యాఫ్తు ఆపాలని కోరుతూ జగన్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదన్నారు. యుపిఏ ప్రభుత్వం తనపై క్కష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఉండగా కాంగ్రెసును ఎందుకు విమర్శిస్తున్నారన్నారు. యుపిఏ మిత్ర పక్షమైన డిఎంకెకు చెందిన కలైంజ్ఞర్ టీవి పైనా సిబిఐ దాడులు చేస్తోందన్నారు. జగన్ వినతి పత్రం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కాలేదన్న జగన్ తాను అంత ఆస్తి ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. జగన్చే ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తే బావుంటుందన్నారు.
లగడపాటి శ్రీధర్ పేరును సిబిఐ తొలగించలేదన్నారు. లగడపాటి శ్రీధర్ కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయన్నారు. అక్రమాలకు ఆధారాలు ఉన్నందు వల్లే సోదాలు జరుగుతున్నాయని సిబిఐ స్వయంగా చెప్పిందన్నారు. సండూరుకు 5 బినామీ కంపెనీలను సృష్టించి అక్రమంగా రూ.500 కోట్లు సేకరించ లేదా అని ప్రశ్నించారు. మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్ధన్ రెడ్డి జగన్ను తన తమ్ముడని అన్నారని కాని జగన్ గాలి అన్న అన్నారు.












Click it and Unblock the Notifications