అలాంటి వాళ్లం కాదు: జగన్కు ప్రధాని మన్మోహన్ క్లాస్

కాగా నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న జగన్కు గురువారం ప్రధాని అపాయింట్మెంట్ దొరికింది. మధ్యాహ్నం ప్రధానితో భేటీ అయ్యారు. సిబిఐ అంశంతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాని దృష్టికి జగన్ తీసుకు వెళ్లారు. రాష్ట్రంలోని పంట విరామం, రైతు సమస్యలపై ప్రధానికి జగన్ రెండు పేజీల వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చొరవ చూపాలని కోరారు. సాగు సమ్మె, ఎరువుల కొరత, మద్దతు ధర దక్కక పోవడాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పటికీ రైతులకు అందలేదని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తూ నిధులు అందజేయాలని కోరారు. కాగా అంతకుముందు జగన్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ను కలిశారు.












Click it and Unblock the Notifications