వైయస్ జగన్‌కు దొరికిన ప్రధాని అపాయింట్‌మెంట్

Manmohan Singh
న్యూఢిల్లీ: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ దొరికింది. కాంగ్రెసు పార్టీ తనపై సిబిఐ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటుందని జాతీయ నేతలను కలిసి చెప్పడానికి సోమవారం న్యూఢిల్లీ వెళ్లిన జగన్ అప్పటి నుండి ప్రధానిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు ప్రధానిని కలవడానికి ప్రయత్నాలు చేస్తూనే జాతీయ నేతలను ఒక్కొక్కరిగా కలుస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం గం.12.30ని.లకు జగన్‌కు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ దొరికింది. ప్రధానితో సమావేశమై తనపై సిబిఐ దాడులు కక్షపూరిత చర్యలు అని ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

దాంతో క్రాప్ హాలీడే, రైతుల సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. కాగా ప్రధానిని కలవడానికి ముందు జగన్ ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే జగన్ శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్‌లను కలిశారు. అయితే వారి నుండి జగన్‌కు ఆశించినంత స్పందన రాలేదు. ఇక కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఐ, సిపిఐ, బిజెపి నేతలను కలవడానికి చేసే ప్రయత్నాలు ఫలించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+