వైయస్ జగన్‌కు ముఖం చాటేసిన సుష్మా స్వరాజ్

Sushma Swaraj
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లోకసభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ముఖం చాటేస్తున్నారు. వైయస్ జగన్‌ను కలుసుకోవడానికి ఆమె ఇష్టపడడం లేదని అర్థమవుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా తాను వైయస్ జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేనని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. లోకసభలో జగన్‌కు మద్దతిస్తున్నట్లుగా మాట్లాడడం ద్వారా బిజెపి ఇరకాటంలో పడిందని, జగన్‌ను కలుసుకుంటే మరింత ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని గ్రహించి ఆమె జగన్‌ను కలవకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో సుష్మా స్వరాజ్‌తో పాటు ప్రతిపక్షాల నాయకులందరినీ కలుస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. తనకు మద్దతుగా మాట్లాడినందుకు జగన్ సుష్మాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పారు.

తమ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతోనే బిజెపి నాయకత్వం కక్కలేని మింగలేని పరిస్థితిలో పడింది. గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్‌కు దగ్గర అనే వార్తలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి సుష్మా స్వరాజ్ తమ తల్లిగా కూడా చెప్పుకున్నారు. దాంతో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఆమె తీవ్రంగా తంటాలు పడాల్సి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి చొరవ వల్లనే సుష్మా స్వరాజ్ లోకసభలో జగన్‌కు అనుకూలంగా మాట్లాడారనే ప్రచారం జరిగింది. అక్రమాలకు పాల్పడినవారిని సమర్థిస్తున్నారనే విమర్శల నుంచి తప్పుకోవడానికి ఆమె జగన్‌ను కలుసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+