హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌ను కోర్టుకెందుకు లాగలేదు: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన లేకనే జగన్ ఢిల్లీ టూర్‌పై విమర్శలు చేస్తున్నారని పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ శుక్రవారం అన్నారు. టిడిపికి రాజీనామా చేసిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వెనుక జగన్ లేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని చెబుతున్న వారు అప్పట్లోనే ఆయనను కోర్టుకు ఎందుకు లాగలేదన్నారు. వైయస్ హయాంలోని మంత్రులపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సర్కారు సుమోటోగా కేసెందుకు బుక్ చేయలేదన్నారు. ప్రతిపక్షాల పైనే సిబిఐ దాడులు జరుగుతున్నాయన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా మొదట స్పష్టం చేయాలని ఆమె అడిగారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉంటే ఎప్పటి వరకు వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మెనే చిట్ట చివరి అవకాశమన్నారు. సమ్మెలో తాము కూడా పాల్గొంటామని చెప్పారు. తెలంగాణ కోసం పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు డైలామాలో ఉన్నారన్నారు. మంత్రులు విధులకు హాజరు కావడం బాధాకరం అన్నారు.

English summary
Parakal MLA Konda Surekha questioned congress government that why they not put case against late YS Rajasekhar Reddy when he live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X