వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి, కాంగ్రెసులను తాకిన తెలంగాణ సమ్మె సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల సమ్మె సెగ కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకలకు తాకుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు మేరకు జరుగుతున్న సకల జనుల సమ్మెతో ఆ రెండు పార్టీల తెలంగాణ నాయకులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. సమ్మెను సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రాజీనామాలు చేయాలని తెలంగాణవాదులు పెడుతున్న డిమాండ్ వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఓ వైపు తెరాస, తెలంగాణ జెఎసిలను తప్పుపడుతూనే తెలుగుదేశం తెలంగాణ నాయకులు మరో వైపు సకల జనుల సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. పైగా, సచివాలయం ముందు ధర్నా చేసి అరెస్టయ్యారు.

కాంగ్రెసు నాయకులు మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కున్నారు. ఉద్యోగులకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథాన్ని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణవాదులు నిలదీశారు. అటు కాంగ్రెసు అధిష్టానం చర్చల పేరుతో తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తుంటే, ఇటు తెలంగాణవాదుల నుంచి కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగావాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేని వాతావరణం ఏర్పడింది. రాజీనామాలు చేయాల్సిందేనని తెలంగాణవాదులు కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెడుతున్నారు.

సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము రాజీనామా చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొండా సురేఖ, కుంజా సత్యవతి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ స్థితిలో తెరాస కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకులపై ఎదురుదాడికి దిగుతోంది. సకల జనుల సమ్మె మొదటి రోజే దాని తీవ్రతను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చవిచూశారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక వారు సతమవుతున్నారు.

English summary
Congress and Telugudesam Telangana leaders are facing trouble with Telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X