కరెన్సీ లారీ పట్టివేత, గాలి జనార్దన్ రెడ్డిదని అనుమానం

ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా బళ్లారి నుంచి వాహనాలపై పోలీసులు నిఘా వేశారు. బళ్లారి సరిహద్దుల్లో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ బైపాస్ రోడ్డు వద్ద కరెన్సీ ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీ ఓబుళాపురం మైనింగ్కు సంబంధించిందని భావిస్తున్నారు. మూడు సంచుల్లో కరెన్సీ ఉంది. అయితే, సొమ్మును హైదరాబాదుకు కాకుండా కడపకు తరలిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు తరలిస్తుండవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. లారీలో డబ్బులు పెట్టిన విషయం తనకు తెలియదని డ్రైవర్ అంటున్నాడు.
కాగా, రాష్ట్ర మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ను సిబిఐ అధికారులు హైదరాబాదులో గురువారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి గురువారం సిబిఐ ముందు హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కేసులోనే హైదరాబాదులోని సోమాజిగుడాలో గల నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications