హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ దీక్ష యోచనలో కెసిఆర్, సమ్మెకు మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మళ్లీ నిరాహార దీక్ష చేపట్టే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సకల జనుల సమ్మెకు మద్దతుగా దీక్ష చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన పార్టీ ముఖ్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, కుటుంబ సభ్యులు గానీ పార్టీ ముఖ్యులు గానీ అందుకు సముఖంగా లేరని అంటున్నారు. దీక్ష చేపట్టవద్దని వారు కెసిఆర్‌కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఆయన నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్ష కారణంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సీమాంధ్ర నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం తన ప్రకటన నుంచి వెనక్కి తగ్గింది.

English summary
TRS president K Chandrasekhar Rao in a bid to start indifinate fast supporting Telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X