Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సకల జనుల సమ్మెకాదు, సకల కష్టాల సమ్మె: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణలో జరుగుతున్నది సకల జనుల సమ్మె కాదని, అది సకల కష్టాల సమ్మె అని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. రైల్ రోకో సందర్భంగా విజయవాడలో ఆగిపోయిన ప్రయాణికులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమ్మె వల్ల నష్టపోతున్నది తెలంగాణ ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 90 శాతం మంది ప్రజలు సమ్మెను ఆమోదించడం లేదని ఆయన చెప్పారు.

ప్రభుత్వం సహనం, శాంతితో వ్యవహరిస్తోందని, భావోద్వేగాల సమస్య కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. త్వరలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్ రోకో వల్ల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఏమీ లేదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని ఆయన గుంటూరులో శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+