చంద్రబాబు దెబ్బ: టిడిపి నుండి మరో ఎమ్మెల్యే అవుట్

అదే జిల్లాకు చెందిన కామారెడ్డి శాసనసభ్యుడు గంపా గోవర్ధన్ తాజాగా కెసిఆర్ను కలవడం ఆయన టిడిపిని వీడనున్న నేపథ్యంలో జిల్లాలో టిడిపి బలం పూర్తిగా తగ్గి పోయిందనే చెప్పవచ్చు. అయితే గంపా టిడిపిని వీడటం వెనుక తన నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడమే అని తెలుస్తోంది. సోమవారం కామారెడ్డిలో తెలంగాణ కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. జిల్లాకు చెందిన తెలంగాణవాదులు సైతం ఆయనను నిలదీశారు. దీంతో ఆయన రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచిస్తున్న టిడిపిని వీడతానని ఆయన అక్కడికక్కడే సోమవారం ప్రకటించారట. అన్నట్టుగానే ఆయన కెసిఆర్ను కలిసి తెలంగాణ తాను టిఆర్ఎస్లో చేరతానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
పోచారం తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లారు. తన ఎమ్మెల్యే పదవికి ఆయన రెండుసార్లు రాజీనామా చేశారు. ఆయితే స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తున్న ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారి తదితర ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి రాజీనామా చేశారు. గంపా టిడిపికి దూరమైతే ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఆ పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగురికి చేరుకుంటుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications