కెసిఆర్‌తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, కేంద్రం దూతగా?

Asaduddin and KCR
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ సోమవారం భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె సాగుతున్న ప్రస్తుత తరుణంలో వీరివురి భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దూతగానో, కాంగ్రెసు అధిష్టానం దూతగానో అసదుద్దీన్ కెసిఆర్‌ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. కెసిఆర్ వద్దకు ఆయన ముఖ్యమైన సమాచారం తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమాచారం ఏమిటనేది తెలియడం లేదు.

కెసిఆర్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే అసదుద్దీన్ వెళ్లిపోయారు. గత 15 రోజులుగా సకల జనుల సమ్మె జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ స్థితిలో అసదుద్దీన్ కెసిఆర్‌ను కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విభజించడం బర్త్ డే కేక్ కట్ చేసినంత సులభం కాదని అసదుద్దీన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ భేటీపై తెరాస వర్గాలు కూడా నోరు మెదపడం లేదు. ముఖ్యమైన సమాచారం ఉండడం వల్లనే ఎవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. కాంగ్రెసులో తెరాస విలీనం గురించి అసదుద్దీన్ కెసిఆర్‌తో ఏమైనా మాట్లాడారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులపై విశ్వాలం లేకపోవడంతో మూడో వ్యక్తిగా కాంగ్రెసు అధిష్టానం అసదుద్దీన్‌ను కెసిఆర్ వద్దకు పంపినట్లు భావిస్తున్నారు. ముస్లింల సంక్షేమంపై ఏర్పడిన సచార్ కమిటీ నివేదిక అమలుకు సహకరించాలని తాను కెసిఆర్‌ను కలిసినట్లు ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంపై తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు. అయితే, ఆయన సచార్ కమిటీ నివేదికపైన కాకుండా తెలంగాణపైనే కెసిఆర్‌తో చర్చలు జరిపారని బలమైన ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+