బొత్స సత్తిబాబు వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి: మరో వివాదం

పార్టీ అధిష్టానం ముందు తన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బిసిలు,త ఎస్సిలు పార్టీ దూరమైతే కష్టమని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారని, వారిని నిలబెట్టుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని బొత్స వర్గం అంటోంది. ముఖ్యమంత్రి నివేదిక తప్పుల తడక అని ఆ వర్గం వాదిస్తోంది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన గర్జన సభకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి నిరాకరించారని తెలుస్తోంది. అయితే, తాను వెళ్లకపోతే నష్టం తనకేనని, చిరంజీవి - బొత్స సత్యనారాయణ వీరవిహారం చేస్తారని భావించి తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications