శంకర రావు లేఖతో సబితకు షాక్, సిబిఐ దర్యాఫ్తు

లంచం తీసుకొని ఎక్సైజ్ పోలీసు అధికారులను మోపిదేవి బదిలీలు చేశారని గతంలో ఆరోపించారు. ఇక మంగళవారం సబితారెడ్డి పైనా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సబితా రెడ్డి డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలలో సబిత తనయుడు, తమ్ముడుకి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సబితపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే వచ్చే నెల 2వ తారీఖున తాను తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
కాగా మంగళవారం శంకర రావు డిజిపికి లేఖ రాశారు. తనకు అదనపు భద్రత అవసరం లేదని ప్రస్తుతం ఉన్న భద్రతనే కొనసాగించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. తన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. తనకు భద్రత ఎందుకు వద్దన్నానో కారణంగా తర్వాత చెబుతానని లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications