రేపే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల రాజీనామా

తమ పార్టీ శాసనసభ్యుడు గంప గోవర్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిసిన నేపథ్యంలో తెలుగుదేశం మరో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను కెసిఆర్ బెదిరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ శాసనసభ్యులపై దాడులు జరిపించి, వారిని భయభ్రాంతులకు గురి చేసి తెరాసలో చేరేలా ఒత్తిడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తనను ఇబ్బందులు పెడుతున్నారని, ఇంటిపై దాడులు చేయిస్తున్నారని, గతంలో గంప గోవర్ధన్ పలుమార్లు తనతో చెప్పినట్లు ఆయన చెప్పారు. కెసిఆర్ను గోవర్ధన్ ఎందుకు కలిశారో తెలియదని, సంప్రదించాలని ప్రయత్నిస్తే అందుబాటులో లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications