గాలి కేసులో జానకి కొండపిని ప్రశ్నించిన సిబిఐ
గాలి జనార్దన్ రెడ్డి గనుల్లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అటవీ శాఖ ఎందుకు పట్టించుకోలేదని, జయ కుమార్ను ఎనిమిదేళ్లకు పైగా అటవీశాఖలో ప్రధాన కార్యదర్శిగా ఎందుకు కొనసాగిస్తున్నారని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే ఆమెను మరోసారి ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. అనంతపురం డీఎఫ్వోగా పని చేసిన కల్లోల్ బిశ్వాస్ అందించిన వివరాల ఆధారంగానే జానకిని ప్రశ్నించినట్లు సమాచారం. అక్రమ ఖనిజాన్ని ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన కారంపొడి మహేశ్ రెండోరోజున సీబీఐ విచారణకు హాజరయ్యారు. తానేమీ అక్రమాలకు పాల్పడలేదని, గాలితో కేవలం ట్రాన్స్పోర్టర్గానే సంబంధాలున్నాయని మహేశ్ మీడియాతో అన్నారు. కాగా మరిన్ని కీలక సాక్ష్యాల కోసం కేరళ, ముంబై, కోల్కతాలకు సీబీఐ బృందాలు వెళ్లాయి.
Comments
English summary
CBI questioned retired IAS officer Janaki Kondapi in Gali Janardhan Reddy's case.
Story first published: Wednesday, September 28, 2011, 8:33 [IST]