ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కోదండరామ్ మండిపాటు

Kodandaram
న్యూఢిల్లీ: తమపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. సమ్మె కారణంగానే విద్యుత్ కోత ఏర్పడిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. విద్యుత్ కోతకు సెమ్మ కారణం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన అసమర్ధతను వేరే వారిపై నెట్టివేస్తున్నారని కోదండరాం విమర్శించారు. జల విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఐదు రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందనడం అబద్దమని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి నిరాశ నిష్పృహలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

నిరుడు ఎంత విద్యుత్ కొనుగోలు చేశారో, ఇప్పుడెంత కొన్నారో ముఖ్యమంత్రి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వం అమ్ముతోందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ సమస్యపై ప్రధానమంత్రితో మాట్లాడేవారని ఆయన అన్నారు. జల విద్యుత్ ఉత్పతిపై ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నాని సవాల్ చేశారు. కరెంట్ కోతలపై రైతులు తెలంగాణ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కోదండరామ్ సూచించారు. సమ్మెపై ముందుగానే చెప్పినా ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+