బొత్సపై చెప్పులు విసిరిన జగన్ పార్టీ కార్యకర్తలు

వైయస్ జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ పాల్గొన్న ఇందిర జల ప్రభ కార్యక్రమంలోనూ నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వాకి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, కుర్చీలు ఎక్కడికి అక్కడ విసిరి వేయడం చేసిన విషయం తెలిసిందే. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications