కెసిఆర్కు సీమాంధ్ర టిడిపి నేత సోమిరెడ్డి ప్రశ్నలు
ఉద్యమం పేరుతో పత్రిక, చానెల్ ఆటంకం లేకుండా నడుస్తున్నాయి. కలెక్షన్స్ కూడాయథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఐదు మాసాల క్రితం ఢిల్లీలోని కేకే ఇంట్లో కాంగ్రెస్ను బలోపేతం చేయాలన్న పని ఎంత వరకొచ్చిందన్నారు. 15 రోజుల్లో తెలంగాణ వస్తుందని సిగ్నల్స్ వచ్చాయని నెల క్రితం అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా నిత్యం టిడిపిని ఆడిపోసుకునే మీరు తెలంగాణను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించే ఎంఐఎం పార్టీ ఓవైసీని, మనసా, వాచా ప్రత్యేక వాదాన్ని వ్యతిరేకించే దానం, ముఖేష్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ను పల్లెత్తు మాట ఎందుకనరని ప్రశ్నించారు.
నిత్యం కెసిఆర్ కేకే, జానాలతో మంతనాలు జరుపుతారని విమర్శించారు. కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమానంలో తిరుగుతుంటే ఇక్కడి ప్రజలు రైళ్లలో కూడా ప్రయాణించకూడదా అని, తెలంగాణ వస్తే దళితుడు సిఎం, ముస్లిం డిప్యూటీ సిఎం అంటారు. కానీ పార్టీలో కెసిఆర్ కు లెఫ్ట్ కేటీఆర్, రైట్ కోదండరాం, ఫ్రంట్ కవిత, బ్యాక్ హరీష్ ఉంటారు. పై నలుగురిని దాటుకుని ఏ దళితుడైనా, ముస్లిం అయినా మీ పక్కన నిలబడగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, నష్టాలను పణంగా పెట్టి, కాంగ్రెస్తో కలిసి రాజకీయ ప్రయోజనాలు పొందడమే మీ లక్ష్యమా అని విమర్శించారు.