వైయస్ జగన్ ధర్నాకు ముగ్గురు ఎమ్మెల్యేలే

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న ధర్నాకు ముగ్గురు శానససభ్యులు మాత్రమే హాజరయ్యారు. కరెంట్ పోరులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంగళవారం ధర్నా చేసింది. ఈ ధర్నాలో వైయస్ జగన్ కూడా పాల్గొన్నారు. ఈ ధర్నాకు కడప జిల్లాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు మాత్రమే ధర్నాకు హాజరయ్యారు. ఆదినారాయణ రెడ్డి ధర్నాకు రాలేదు. ఆయన గైర్హాజరుకు కారణం తెలియదు.

బద్వేలు శానససభ్యురాలు కమలమ్మ కడప, పులివెందుల ఉప ఎన్నికలకు ముందే వైయస్ జగన్‌కు దూరమయ్యారు. కాగా, మాజీ శానససభ్యులు రఘురామిరెడ్డి, గోవింద రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, రాజమల్లు ప్రసాద్ రెడ్ిడ, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ మునయ్య, డిసిసివి చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వైయస్ జగన్ ధర్నాకు కూర్చుకున్నారు. కరెంట్ కోతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ జగన్ ఆరోపించారు. కాంగ్రెసు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ సోదరుడు ధర్నాలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+