బాళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి గనుల్లో సిబిఐ బృందం

ఇకముందు కూడా గనులను సందర్శిస్తామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డీఎంఎస్, రామ్ఘడ్ అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీల రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. ముఖ్యంగా ముడిఖనిజం ఎగుమతులు, దిగుమతులకు చెందిన పత్రాలపై దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ నిపుణులు, రికార్డు సెక్షన్కు చెందిన వారినీ ప్రశ్నిస్తామని చెప్పారు. గతంలో సీబీఐ అందజేసిన నివేదికను సుప్రీం పర్యావరణ ధర్మాసనం శుక్రవారం పరిగణనలోకి తీసుకుంది. ఓఎంసీ, దక్కన్ మైనింగ్ కార్పొరేషన్లకు సంబంధించిన బాధ్యుల వివరాలను సమర్పించాలని శుక్రవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇక బళ్లారి మైనింగ్ కార్పొరేషన్ యాజమాన్యానికి సంబంధించి స మాచారంతో మరొక నివేదికను ఇవ్వాలని సూచించింది.












Click it and Unblock the Notifications