చెప్పినా వినలేదు: అరెస్టైన ఎంపీలపై సిఎం కిరణ్

తెలంగాణ వ్యాప్తంగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా, ఒక్కరిపైనే కేసులు ఎత్తివేయడం సరికాదని సీఎం వివరించారు. రైలు రోకోకు వెళుతున్న ఎంపీలను మార్గంలోనే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రజాప్రతినిధులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కాకుండా చూడాల్సిందని, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రిని నిలదీశారట. వారిని ఇంటి వద్దే అరెస్టు చేస్తామని పోలీసు అధికారుల ద్వారా సమాచారం పంపామని కానీ, పోలీసులు వెళ్లేందుకు ముందే రైలు రోకోకు వారు వెళ్లిపోతే తానేమీ చేయగలనని సిఎం సమాధానమిచ్చారట. నిజానికి ఎవరెవరిపై ఏయే కేసులు నమోదు అయ్యాయో తనకు పూర్తి వివరాలు తెలియదని, అయితే ఎంపీ పొన్నంపై ఆందోళన కేసుతో పాటు పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్న కేసు నమోదయ్యాయని సీఎం వివరించారు. బెయిల్కు పొన్నం నిరాకరించడంతో రిమాండ్ పడిందని తెలిపారు. కాగా, అనంతరం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్లిన సమయంలో క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎంపీలు కే కేశవరావు, మధుయాష్కీ గౌడ్లు అక్కడే బైఠాయించారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం హుటాహుటిన తిరిగి వచ్చారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని కేశవరావు ఆగ్రహంతో ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గతంలో ఎంపీ పొన్నం ప్రభాకర్తో సీఎంకు జరిగిన వాగ్వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షతోనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. రైల్వే ఆస్తులకు నష్టం జరగనందున ప్రజాప్రతినిధులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారని కేకే అన్నారు. పొన్నంపై కక్షతోనే సీఎం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని మీడియా వద్ద కేకే విమర్శించారు. ఆదివారం పొన్నం ప్రభాకర్కు బెయిల్ తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి తనకు పంపిన ఎస్ఎంఎస్ను మీడియాకు చూపారు. ప్రజా ప్రతినిధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కేశవరావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications