నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2012లో తెలంగాణ రాష్ట్రం తథ్యం: ఎల్‌కె అద్వానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani
నిజామాబాద్: 2012 సంవత్సరంలో తెలంగాణ రావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల జన చేతన యాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసుకోవడం నా జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణపై కేంద్రం అయోమయంలో ఉందని విమర్శించారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎన్డీయే పదేళ్ల క్రితం మూడు రాష్ట్రాలను ఇచ్చిందన్నారు. తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందన్నారు.

వచ్చే శీతాకాల సమావేశాల్లో యుపిఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందన్నారు. కొత్త రాష్ట్రాల కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదన్నారు. తెలంగాణ న్యాయపరమైన డిమాండ్ అన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణపై 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసిన కేంద్రం పదిహేను రోజుల్లో మళ్లీ మాట మార్చిందని ధ్వజమెత్తారు.

English summary
BJP senior leader LK Advani said today that Telangana state will come in 2012. He blamed UPA government for change December 9th statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X