తెలంగాణపై మాట తప్పం: డిసెంబర్ 9పై బొత్స

కాగా అంతకుముందు ఉదయం హైదరాబాదులో మాట్లాడిన ఆయన తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలు వినిపిస్తున్న నేతలు ఏ జెఎసిల్లోనూ పని చేయవద్దని ఆయన సూచించారు. ప్రజల మనోభావాలను పార్టీపరంగా మాత్రమే వినిపించాలని, ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ నేతలు వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి మాత్రమే వినిపించాలని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ఉద్యమాలు చేయవద్దనేది పార్టీ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. సున్నితమైన తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, అందుకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమ్మె విరమించడం వల్ల తెలంగాణ వాదం వెనక్కి పోయిందని, ఓడిపోయిందని అనుకుంటే పొరపాటని, అలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. పట్టుదలను, ఐక్యతను చాటి చెప్పేందుకు, మనోభావాలను వ్యక్తం చేయడానికి సమ్మెను వాడుకోవాలే తప్ప సమ్మెతో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు.
కాగా తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెసు కట్టుబడి ఉంటుందని తాను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications