హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ నేతలకు బొత్స హుకుం, తమతోనే చెప్పాలని సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ప్రదేశ్ కాంగ్రెసు(పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలు వినిపిస్తున్న నేతలు ఏ జెఎసిల్లోనూ పని చేయవద్దని ఆయన సూచించారు. ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాలు చేయవద్దని ఆయన ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల మనోభావాలను పార్టీపరంగా మాత్రమే వినిపించాలని, ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ నేతలు వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి మాత్రమే వినిపించాలని ఆయన అన్నారు.

ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ఉద్యమాలు చేయవద్దనేది పార్టీ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. సున్నితమైన తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, అందుకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమ్మె విరమించడం వల్ల తెలంగాణ వాదం వెనక్కి పోయిందని, ఓడిపోయిందని అనుకుంటే పొరపాటని, అలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. పట్టుదలను, ఐక్యతను చాటి చెప్పేందుకు, మనోభావాలను వ్యక్తం చేయడానికి సమ్మెను వాడుకోవాలే తప్ప సమ్మెతో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana ordered party leaders not work with other parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X