తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో డ్రగ్స్‌తో పట్టుబడిన ఇంజనీరింగ్ విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడ్డారు. మధుకుమార్, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. వారి నుంచి 800 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తిరుపతిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం సంచలనం సృష్టించింది.

ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. వారికి కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఏం చేయాలనుకున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, వారిద్దరు ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. వారిని ప్రశ్నించడం ద్వారా డ్రగ్స్ గుట్టు విప్పే పనిలో పోలీసులు ఉన్నారు.

English summary
Two engineering students were nabbed with drugs by police at Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X