వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం త్వరలో కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు త్వరలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు బుధవారంనాడు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రకటించారు. ఎలాంటి పరిస్థితిలో దీక్ష చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదని ఆయన అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు కెసిఆర్ దీక్షకు వెనకాడబోరని ఆయన అన్నారు. తెలంగాణ సకల జనుల సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిందని ఆయన అన్నారు.

తెలంగాణ మంత్రులు పదవులు వీడితేనే తెలంగాణ వస్తుందని మాజీ మంత్రి, కాంగ్రసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసి కార్మికులను చూసైనా తెలంగాణ మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్రులను ఎదిరించి ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగారని, తెలంగాణ మంత్రులు కూడా సీమాంధ్ర పాలకులను ఎదిరించాలని ఆయన అన్నారు. 18 ఏళ్లుగా మంత్రి పదవిలో ఉన్న ఓ రాజకీయనాయకుడు తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి వెనకాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసి కార్మికుల ప్రదర్శించిన ఐక్యత తెలంగాణ మంత్రులు ప్రదర్శించి ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ నేతల మధ్య విభేదాలు సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao will take up fast onto death for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X