తెలంగాణ కోసం త్వరలో కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

తెలంగాణ మంత్రులు పదవులు వీడితేనే తెలంగాణ వస్తుందని మాజీ మంత్రి, కాంగ్రసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసి కార్మికులను చూసైనా తెలంగాణ మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్రులను ఎదిరించి ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగారని, తెలంగాణ మంత్రులు కూడా సీమాంధ్ర పాలకులను ఎదిరించాలని ఆయన అన్నారు. 18 ఏళ్లుగా మంత్రి పదవిలో ఉన్న ఓ రాజకీయనాయకుడు తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి వెనకాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసి కార్మికుల ప్రదర్శించిన ఐక్యత తెలంగాణ మంత్రులు ప్రదర్శించి ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ నేతల మధ్య విభేదాలు సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications