జానారెడ్డికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగింపు

రాజీనామాలు చేసే విషయంలో తొందర పడవద్దని, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి రాజీనామాలుచేస్తే ఇబ్బందుల ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జానా రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అందుకు కాస్తా సమయం కావాలని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా జానారెడ్డితో మాట్లాడారు. రాజీనామాలు చేసే విషయంలో తొందరపడవద్దని ఆయన జానారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications