వాళ్లిద్దరు అనుకుంటే తెలంగాణ వస్తుంది: అద్వానీ

యుపిఎ ప్రభుత్వంలోని కుంభకోణాలపై సినిమా తీయవచ్చునని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. యుపిఎ ప్రభుత్వంలోని కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని ఆయన అన్నారు. నల్లధనం వెలికితీతలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తనకు విశేమైన ఆదరణ లభించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం లభించిన ఆదరణ మునుపెన్నడూ లభించలేదని ఆయన అన్నారు. ప్రస్తుత యాత్ర గత యాత్రలకన్నా భిన్నమైందని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందే తన యాత్ర ముగుస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణలో అద్వానీ జనచేతన యాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. ఆయన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సాగించిన యాత్రలో ప్రతిచోటా తెలంగాణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండును నెరవేర్చకపోవడంపై కాంగ్రెసుపై విమర్శలు చేశారు. ప్రసంగం చివరలో జైజై తెలంగాణ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications