బాబుకు మొహం చాటేస్తున్న తెలంగాణ టిడిపి నేతలు

ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో పోటీకి దిగితే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వస్తాయని కూడా భావించారు. అదే సమయంలో కాంగ్రెసు మాత్రం పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. కాంగ్రెసు అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అందరూ భావించారు. కానీ అనూహ్యం అతను 33వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దీంతో టిటిడిపి ఖంగు తిన్నది. పోటీలో ఉంటే డిపాజిట్ కూడా దక్కదనుకుంటే కాంగ్రెసుకు భారీ ఓట్లు రావడం వారిని పునరాలోచనలో పడేసింది. బాబు నిర్ణయం ప్రకారం పోటీకి దిగితే కనీసం క్యాడర్ను కాపాడుకునే వారమనే భావన వారిలో కలిగినట్లుగా కనిపిస్తోంది. ఉద్యమ ఉధృతంగా ఉన్న సమయంలో లక్ష మెజార్టీతో గెలుస్తాడని భావించిన తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం యాభై వేల మెజార్టీతో గెలుపొందటంతో బాబుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు మొహం చాటేస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications