వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలత చెంది జైలుకే వెళ్తానంటున్న యడ్యూరప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: తీవ్రంగా కలత చెందిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారు. భూ కుంభకోణంలో ఇరుక్కున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై తమ పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ చేసిన వ్యాఖ్యలకు యడ్యూరప్ప తీవ్రంగా కలత చెందినట్లు భావిస్తున్నారు. యడ్యూరప్ప వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అవినీతి పార్టీని బలహీనపరుస్తుందని అద్వానీ మంగళవారం వ్యాఖ్యానించారు. భూ కుంభకోణం కేసులో అరెస్టయిన యడ్యూరప్పకు కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో ఆదివారం ఉదయం యడ్యూరప్పను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జయదేవ కార్జియాలజీ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. యడ్యూరప్ప గుండె సజావుగానే పనిచేస్తోందని ఇనిస్టిట్యూట్ తేల్చి చెప్పింది. దీంతో ఆయనను ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్టోరియా ఆస్పత్రికి మార్చారు. తద్వారా జైలుకు వెళ్లడాన్ని యడ్యూరప్ప వాయిదా వేస్తూ వస్తున్నారనే విమర్శలు కూడా చుట్టుముట్టాయి. ఈ మేరకు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. దీంతో కలత చెందిన యడ్యూరప్ప తాను జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్న చెప్పారు. తనను మోసగాడిగా చూస్తున్నారని యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

English summary
Former Karnataka chief minister BS Yeddyurappa, who is accused of involvement in a land scam and is currently in hospital, is reportedly “hurt” and wants to shift back to jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X