సెటిలర్స్ తెలంగాణ ద్రోహులు: పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Srinivas Reddy
హైదరాబాద్: కొందరు సెటిలర్స్ తెలంగాణ ద్రోహులని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఇటీవల బాన్సువాడ ఉప ఎన్నికలలో గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం విమర్శించారు. సెటిలర్స్ తెలంగాణ కోరుకుంటున్నారని తాము భావించామని అందుకే మా వైపు ఉంటారనుకుంటే వారు తెలంగాణ ద్రోహులకు ఓటు వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో స్థిరపడిన సెటిలర్స్ తెలంగాణ వైపే ఉన్నారని కొందరు మాత్రమే ద్రోహం చేస్తున్నారని వారు తమ వైఖరి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణకు అందరూ మద్దతు పలకాలన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటిసారి ఆయన తెలంగాణ భవనంకు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కు కావడం వల్లే కాంగ్రెసు అభ్యర్థికి డిపాజిట్ దక్కిందన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో బాబు పోటీ చేస్తే పరువు పోతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ఎస్సైలను బదలీ చేసి సీమాంధ్ర పోలీసులను రప్పించి కాంగ్రెసు ఏజెంట్లుగా పెట్టారని విమర్శించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం పోచారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+