పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంట

K Chandrasekhar Rao and Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికి పోలవరం టెండర్లు దక్కాయన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టిడిపి, తెరాస మధ్య మంటలు రాజుకున్నాయి. రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రధానంగా తెరాస నేతలు ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ వివరణ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలపై తెరాస నేతలు బోయినపల్లి వినోద్ కుమార్, జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వారి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడతారని విమర్శించారు. కెసిఆర్‌పై ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆరోపణలు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. పోలవరం రద్దు కోసం తెరాస ఎప్పుడూ పోరాడుతుందన్నారు. పోలవరం అన్ని టెండర్ల రద్దు ప్రక్రియను తెరాస పోరాటం చేస్తుందన్నారు. పోలవరాన్ని అడ్డుకున్నది కెసిఆరే అని విషయం రేవంత్ గుర్తించాలన్నారు. అసలు పోలవరంపై టిడిపి వైఖరేంటని ప్రశ్నించారు.

కెసిఆర్‌పై అనవసర దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ఈ అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మూడు చెరువుల నీళ్లు తాగించింది కెసిఆరే అన్నారు. కెసిఆర్ లక్ష్యం తెలంగాణ ఏర్పాటు అన్నారు. రాజాంకు ష్యూ కంపెనీలో మూడు శాతం పెట్టుబడులు మాత్రమే ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. కాగా అంతకుముందు రేవంత్ రెడ్డి కెసిఆర్ సకల జనుల సమ్మెను వ్యాపారంగా మార్చారని విమర్శించారు. నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వారికి పోలవరం టెండర్లు వచ్చాయన్నారు. ఉద్యమాన్ని చల్లబరుస్తామని చెప్పి కెసిఆర్ తన పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికి టెండర్లు తెచ్చుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+