అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతపురంలో వైయస్ జగన్ పార్టీ నేత గృహనిర్బంధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur District
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా నేత మోహన్ రెడ్డిని, మరో పదిమంది కార్యకర్తలను శుక్రవారం అనంతపురం జిల్లా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లాలో తుంకూరు - రాయదుర్గం కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు శంకుస్థాపన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రైల్వే సహాయ మంత్రి మునియప్ప తదితరులు వస్తున్న నేపథ్యంలో వారిని ముందస్తుగా నిర్బంధించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానంతో వారిని నిర్బంధించారని సమాచారం.

కాగా ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఇటీవల సీమాంధ్రలో పర్యటిస్తున్న సమయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పలుమార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. విజయవాడ పార్లమెండు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి.

English summary
Anantapur district police make house arrest YSR Congress Party leaders today. Today CM Kiran Kumar Reddy tour in district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X