హైదరాబాదులో విశాలాంధ్ర సభకు నో పర్మిషన్
కాగా ఇటీవల ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత పరకాల ప్రభాకర్ నేతృత్వంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రెండు సార్లు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. మొదటిసారి సమావేశం పెట్టినప్పుడు పలువురు తెలంగాణవాదులు సమావేశాన్ని అడ్డుకోగా విశాలాంధ్ర నేత ఒకరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రెండు రోజుల క్రితం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ జర్నలిస్టులు మరోసారి వారిని అడ్డుకున్నారు. పోలీసులు జర్నలిస్టులకు నచ్చజెప్పడంతో గతంలో తమపై అమానుష వ్యాఖ్యలు చేసిన మహాసభ నేత బయటకు వెళితేనే తాము ఉంటామని లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడంతో అతను బయటకు వెళ్లి పోయారు. దీంతో పరకాల సమావేశం కొనసాగిస్తూ 22, 23వ తేదీల్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కాగా పోలీసు శాఖ అనుమతి నిరాకరించడాన్ని విశాలాంధ్ర మహాసభ నేత చక్రవర్తి తప్పు పట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించ వచ్చునన్నారు.