రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి
టివి 9లో ప్రసారం చేసినట్లు జగన్ ఇంట్లో ఒక్క ఖాళీ మద్యం బాటిల్ చూపించినా జగన్ ఇంటిని మీకు రాసిస్తాం లేదంటే ఛానల్ మూసేస్తారా అని సవాల్ విసిరారు. టివి 9 అసత్య కథనాలు ప్రసారం చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. ఆధారాలు చూపించకుంటే ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ, రామోజీ రావు, రవి ప్రకాశ్ వస్తే జగన్ ఇంటికి వెళదామని మీ రాతలు నిజమైతే అప్పటికప్పుడే జగన్ నివాసం, సాక్షి ఛానల్ వారి పేర రాస్తామన్నారు. ఏ వ్యక్తినో ముఖ్యమంత్రిని చేయడానికో, ఏ పార్టీనో అధికారంలోకి తీసుకు రావడానికో ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. రామోజీ ఫిల్స్ సిటీ చుట్టూ రోడ్డు నిర్మించారని అది ఎవరి స్థలంలో నిర్మించారని ఆ విషయాలు రాసే దమ్ము ధైర్యే ఏ ఛానెల్, ఏ పత్రికకూ లేదన్నారు. తమకు పత్రికల పట్ల గౌరవం ఉందన్నారు. ఈ విధంగా విలువలు లేకుండా తప్పులు రాయడాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు.