చల్లారని పోలవరం: కెసిఆర్ నోరు విప్పాలన్న టిడిపి

కెసిఆర్ను ఉపయోగించుకొని ఉద్యమాన్ని నీరుగార్చుతుందనడానికి పోలవరం టెండరే మంచి ఉదాహరణ అన్నారు. కాంగ్రెసు ప్రజా ధనాన్ని ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుందన్నారు. నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వారే పోలవరం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడంపై కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు వెల్లడించాలన్నారు. ష్యూ కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ చూపారని విమర్శించారు. పోలవరం ఆరోపణలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు అవాస్తవమని తేలితే దేనికైనా సిద్ధమన్నారు. ఈ అంశంపై తెలంగాణ భవన్లోనైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ కోసం నవంబర్ 1న ఢిల్లీలో చేపట్టే దీక్షకు జెండాలు పక్కన పెట్టి తెలంగాణవాదులంతా మద్దతు పలకాలని కోరారు.












Click it and Unblock the Notifications