ఐదో రోజూ జగన్ ఇంటి లెక్కలు వేస్తున్న సిబిఐ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తును సిబిఐ అధికారులు ముమ్మరం చేశారు. హైదరాబాదులోని లోటస్ పాండులో గల వైయస్ జగన్ ఇంటి లెక్కలను వేయడంలో సిబిఐ అధికారులు మంగళవారం కూడా నిమగ్నమయ్యారు. సిబిఐ అధికారులతో పాటు ఆదాయం పన్ను శాఖ అధికారులు, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారులు వైయస్ జగన్ ఇంటి లెక్కింపులో పడ్డారు. ఇంతకు ముందు జగన్ సోదరి షర్మిల ఇంటి లెక్కలు కూడా సిబిఐ అధికారులు వేసిన విషయం తెలిసిందే.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో హెటిరో డ్రగ్స్ ప్రతినిధులు, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధులు మంగళవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు జగతి పబ్లికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డిని ఇది వరకే ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన అనంతరం సిబిఐ అధికారులు రామకృష్ణా రెడ్డిని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+