నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు మరో షాక్, పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి గుడ్‌బై?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మాజీ శాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం తన పట్ల వ్యవహరించిన తీరు తనను బాధపెట్టిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి మంగళవారం నెల్లూరు జిల్లా కావలికి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి మీడియా వద్ద ఆవేదనను వెల్లబోసుకున్నారు. కావలి సెగ్మెంట్ ఇంచార్జీగా విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టి రామిరెడ్డి ప్రతాప రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం నియమించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది.

పార్టీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని హైదరాబాదులో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కలుసుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తిరిగి పార్టీలోకి రావాలని వారు కోరారు. అయితే, తన అనుచరులతో చర్చించిన తర్వాతనే తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన వారికి చెప్పారు. తన అనుచరులతో సమావేశం కావడానికి ఆయన మంగళవారం కావలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారీ ర్యాలీ కూడా జరిగింది.

English summary
Former legislator and YSR Congress leader, Mr Katamreddy Vishnuvardhan Reddy, said that he was hurt by the way he was treated by the leadership of YSR Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X