సాక్షిలో గాలి పెట్టుబడులు: సిబిఐ ముందు జగన్

YS Jagan
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సాక్షి దినపత్రికను నడుపుతున్న జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులు పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ అధికారులకు చెప్పారు. ఇప్పటి వరకు తాను గాలిని నాలుగు సార్లు మాత్రమే ప్రయివేటు కార్యక్రమాలలో కలిశానని, ఆయనతో వ్యక్తిగత పరిచయం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. జగతిలో ఆర్ ఆర్ గ్లోబల్ పెట్టుబడులు పెట్టిందని, ఓఎంసి లీజుల పొడిగింపుతో తనకు సంబంధం లేదని, ప్రభుత్వంలో వ్యవహారాల్లో భాగంగానే లీజుల పొడగింపు జరిగిందని, తానేనాడు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారట.

గాలి వ్యాపారాలతోనూ సంబంధం లేదని, గాలి పెట్టుబడుల కోసం తాను బలవంతం చేయలేదని, ఆయనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని కూడా చెప్పారని సమాచారం. అందరిలాగే నా కంపెనీలోను పలువురు పెట్టుబడులు పెట్టారని అయితే వారి మూలాల సంగతి తనకు తెలియదని చెప్పారు. సిబిఐ అడిగిన చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పారట. బాబు ఇచ్చిన లీజులనే వైయస్ కొనసాగించారని చెప్పారు.

కాగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ జగన్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, వాస్తవాల కోసం మరింత లోతుగా విచారిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారణకు పిలుస్తారా అంటే జగన్ 2002 నాటి జివో నకల్‌ను తమకు అందించారని దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎమ్మార్ కేసు వ్యవహారం ఈ రోజు మాత్రం ముగిసిందన్నారు. కాగా జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి విచారణకు హజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+