సిబిఐ ముందుకు వైయస్ జగన్, కోఠిలో భారీ బందోబస్తు

జగన్ను ప్రశ్నించే సమయంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఎమ్మార్ కేసు విషయంలో కోనేరు ప్రసాద్ను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయనను సిసిఎస్ నుండి దిల్కుషా గెస్ట్ హౌస్కు శుక్రవారం ఉదయం తరలించారు. ఎమ్మార్ విల్లాల అమ్మకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తాము గుర్తించామని, దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించిన తర్వాతే కోనేరు ప్రసాద్ను అరెస్టు చేసినట్లు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ గురువారమే చెప్పారు. కాగా బళ్లారిలోని సండూరు కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications