ఇక అక్రమ కేసులు లేకుండా చూస్తాం; జానారెడ్డి

Jana Reddy and Harish Rao
హైదరాబాద్: తన సొంత జిల్లాలో తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న చెరుకు సుధాకర్‌పై పిడి యాక్టు పెట్టినట్లు తనకు తెలియదని ఈ కేసు విషయమై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని మంత్రి జానారెడ్డి ఆదివారం చెప్పారు. ఉదయం తన ఇంటివద్ద ఆందోళనకు దిగిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులతో జానారెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నుండి అక్రమ కేసులు లేకుండా చూస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఏవైనా కేసులు పెడితే శాంతిభద్రతలలో భాగంగా పెట్టి ఉండవచ్చునన్నారు. అక్రమ కేసులు ఉంటే ఎత్తివేయించేందుకు కృషి చేస్తానన్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంటుందని కేసులలో ప్రభుత్వం పాత్ర ఉండదన్నారు. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత కేసులు తొలగింపుకు ప్రయత్నిస్తానన్నారు. కోమటిరెడ్డి దీక్షపై సాయంత్రం చర్చించి మాట్లాడతామన్నారు.

జానారెడ్డి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కేసుల విషయంపై మాట్లాడారని హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పారు. ఇకపై ఉద్యమకారులపై కేసులు పెడితే తానే బాధ్యత వహిస్తానని చెప్పారన్నారు. మంత్రులంతా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకే పిడి యాక్టు వంటి కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+