కోమటిరెడ్డి ఆమరణ దీక్ష భగ్నం, నిమ్స్‌కు తరలింపు

komatireddy venkat reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత ఐదు రోజులుగా నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం ఉదయం భగ్నం చేశారు. ఆయనను ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)కు తరలించారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లోని అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. అతను చికిత్సకు నిరాకరిస్తున్నప్పటికీ బలవంతంగా వైద్యం చేస్తున్నారు. కోమటిరెడ్డి తరలింపు దృష్ట్యా ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. కోమటిరెడ్డిని నల్గొండ నుండి తీసుకు వచ్చే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా కోమటిరెడ్డి దీక్ష భగ్నానికి నిరసనగా నల్గొండ జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆందోళనకు దిగాయి. నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, తెలంగాణవాదుల గుమికూడి నిరసన తెలియజేశారు. తెలంగాణ కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా మంగళవారం జిల్లా బందుకు జెఏసి పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+