టిడిపి కార్యకర్తను చెప్పుతో కొట్టిన మరో ఎమ్మెల్యే

ఆ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి గ్రామంలో జరిగింది. ఆందోళనకు దిగిన రాజును తాను తోసేశానని, కొట్టలేదని కన్నబాబు అన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కాంగ్రెసు కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని రాజు రచ్చబండ కార్యక్రమంలో లేవనెత్తారు. దాంతో ఆగ్రహించిన కన్నబాబు వేదిక నుంచి దిగి వచ్చి రాజును తోసేశారు. చెప్పులోత కొట్టారు.
ఆ సంఘటనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే, శాసనసభ్యుడు చెప్పుతో కొట్టినట్లు తాము చూడలేదని పోలీసులు అంటున్నారు. మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఓ కార్యకర్తను కొట్టినందుకు అరెస్టయి, బెయిల్పై విడుదలయ్యారు. ఈ నెల 5వ తేదీన ఆ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications